హాస్య చక్రవర్తికి నివాళి

Posted by జీడిపప్పు

చంటబ్బాయ్ సినిమాలో ఇంగ్లీషు మాట్లాడే బట్లరు పాత్రలో "ఏరా సెవెన్ హిల్సు, ఇది ఆరోసారి రాంగ్ నంబర్ స్పీక్ చేయడం. ఏమి ఆటలుగా ఉందా..ఆహా గేమ్స్ గా ఉందా అని అడుగుతున్నాను. నాతో పెట్టుకోకురా రేయ్. కుంతీ సెకండ్ సన్ బూన్, అదే భీమవరంలో వన్ ఏడాది క్రితం ఒకడిని చావ హిట్టాను. కీపెయ్యి. రెస్పెక్ట్ గా ఫోన్ కీపెయ్యి." "గార్డెన్ కర్రీ పులుసు ఇవాళ స్పెషల్..అదేనమ్మా తోటకూర"  అంటూ నవ్వులు కురిపిస్తారు.

కేవలం హాస్య పాత్రలే కాకుండా స్వాతిముత్యం సినిమాలో కమలహాసన్ ఆస్తి కాజేసే విలన్ పాత్ర పోషించారు. అహనా పెళ్ళంట సినిమాలో తన పిసినారి బావ (కోట శ్రీనివాసరావు) చేష్టలకు మతికోల్పోయే కలెక్టరుగా చిన్న పాత్రలో కనిపిస్తారు. పడమటి సంధ్యారాగం సినిమాలో గుమ్మలూరి శాస్త్రిగారిగారి మాటలు వింటూ, నటన చూస్తుంటే ఆయనకు డబ్బింగ్ చెప్పిన సుత్తి వీరభద్రరావుగారే గుర్తుకొస్తారు. ఇక వివాహ భోజనంబు తర్వాత వచ్చిన చూపులు కలసిన శుభవేళ సినిమాలోని "గుండు పాండురంగం" ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర.

ఘంటసాల పాటలను అమితంగా ఇష్టపడుతూ ఆరాధించే గుండు పాండురంగం ఆరోగ్యానికి మంచిదని తన దగ్గరకు వచ్చిన వాళ్ళనూ, తన దగ్గర పని చేస్తున్న ఉద్యోగులనూ కిలోమీటర్ల కొద్దీ నడిపించుకొని వెళ్ళి వాళ్ళను అక్కడే వదిలేసి తన కారులో తిరిగి వచ్చేస్తాడు. ఇప్పటికీ ఎవరయినా "అలా వాకింగ్ వెళ్తూ మాట్లాడుకుందామా" అంటే ఒక్క క్షణం గుండు పాండురంగం గుర్తుకొచ్చి గుండె గుభేల్మంటుంది!

చూపులు కలసిన శుభవేళ సినిమా అపుడు అనారోగ్యానికి గురి అయిన, వైద్యం వికటించి 1988, జూన్ 30న కేవలం 40 ఏళ్ళ వయసులో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. దశాబ్దకాలం పాటు ఎన్నో మరచిపోలేని పాత్రలలో నటించి ఆరోగ్యకరమయిన హాస్యానికి చిరునామాగా నిలిచిన ఈ హాస్య చక్రవర్తి,  తనూ తొందరగా వెళ్ళిపోయిన ఆయనను సృష్టించిన హాస్యబ్రహ్మ జంధ్యాల స్వర్గంలో అందరినీ నవ్వించింది ఇక చాలనుకొని మళ్ళీ భూమిమీద పుడతారని ఆశిద్దాం.

హాస్యచక్రవర్తి సుత్తి వీరభద్రరావు - మొదటి భాగం
హాస్యచక్రవర్తి సుత్తి వీరభద్రరావు - రెండవ భాగం
హాస్యచక్రవర్తి సుత్తి వీరభద్రరావు - మూడవ భాగం

Transformers 2 రివ్యూ

Posted by జీడిపప్పు

చక్కని కథనం, అప్పటివరకు చూసిన గ్రాఫిక్స్ కంటే విభిన్నమయిన గ్రాఫిక్స్ లతో తీసిన Transformers చూసిన వెంటనే ఈ సినిమా సీక్వల్ తప్పక చూడాలి అని నిర్ణయించుకున్నాను. గత వారం రెండవ పార్టు విడుదలయి కేవలం ఒక్క రోజులో 60 మిలియన్ డాలర్లు, వారాంతానికల్లా $112 మిలియన్ల కలెక్షన్ రాబట్టింది. ఈ వివరాలు చూసి ఈ సినిమా పైన మరిన్ని ఎక్కువ అంచనాలతో వెళ్ళాను.

మొదటి పార్టు హిట్ అయింది కాబట్టి రెండవ పార్టుకు కాస్త ఫ్లాష్‌బ్యాక్ కలపాలన్న ప్రాథమిక సూత్రాన్ని పాటించారు. ఈజిప్టులోని పిరమిడ్లో ఉన్న యంత్రాన్ని పునరుజ్జీవనం చేయడానికి అవసరమయిన "మేట్రిక్స్" కోసం డిసెప్టికాన్స్ ప్రయత్నిస్తుంటే ఆప్టిమస్ తన మితృడయిన హీరోతో కలసి ఎలా ఎదుర్కుంటాడు, చివరికి భూలోకాన్ని డిసెప్టికాన్స్ నుండి ఎలా కాపాడగలుగుతారు అన్నది కథాంశం.

చిక్కనయిన కథతో అలరించిన ఫస్ట్ పార్టుకు భిన్నంగా ఈ కథలో సాగతీత, అనవసరపు సన్నివేశాలు ఎక్కువయ్యాయి. గ్రాఫిక్స్/విజువల్స్ కూడా మొదటిపార్టుతో పోలిస్తే తక్కువే. సూటిగా విషయానికి రాకుండా అనవసరపు ఉపోద్ఘాతాలవల్ల, ఉపన్యాసాలవల్ల కథలో స్పష్టత లేదు. మొదటి అరగంటా హీరో కాలేజీ సోదితో "సాగుతుంది". హీరో హీరోయిన్ల ప్రేమ కథ మరో అనవసరపు ట్రాక్. మొదటి పార్టులోనే ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిపించారు. ఇప్పుడు దానికి ట్విస్టులు ఎందుకు పెట్టారో!

డిసెప్టికాన్లను ఎదుర్కోవడానికి ఆప్టిమస్ ప్రైం తమ గ్రహం నుండి అప్పటికప్పుడు మరికొందరు ఆటోబాట్స్ ను ఎందుకు పిలిపించడో అర్థం కాదు. హీరోయిన్ దగ్గరున్న వస్తువును కాజేయడానికి వచ్చిన డిసెప్టికాన్ చైనుకు కట్టివేయబడి కుక్కపిల్లలా ప్రవర్తిస్తూ హీరోయిన్‌కు సహాయం చేస్తుంది!! హీరో తల్లిదండ్రులను ఈజిప్టుకు తీసుకురావలసిన అవసరం కథకు ఏ కోశానా కనపడదు. చివరగా ఆప్టిమస్ ప్రైం అన్ని డిసెప్టికాన్లను మట్టుపెట్టడు. బహుశా మూడో పార్టుకోసం కావచ్చు. గ్రాఫిక్స్ కూడా అంతంత మాత్రమే. మొదటి సన్నివేశంలో కాస్త,  చెట్లమధ్య ఆప్టిమస్-డిసెప్టికాన్ల మధ్య ఫైట్, చివరగా పిరమిడ్ల పైన దాడి జరిగే సన్నివేశాలు మాత్రమే ఆకట్టుకుంటాయి.

నటీనటుల విషయానికొస్తే -  సినిమా మొత్తం పైన "నటన" అన్నది దాదాపు కనిపించదు. సినిమా అంతా కేవలం రెండు-మూడు ఎక్స్ ప్రెషన్లతో లాగించే మహేష్‌బాబులా Shia LaBeouf అతి తక్కువ హావభావాలతో "నటించాడు". మొదటి పార్టులో అస్థిపంజరంలా ఉన్న Megan Fox ఈ సినిమా కోసమే కాస్త బరువు పెరిగి సెక్సీగానే కనిపిస్తుంది, అక్కడక్కడా చాలా హాట్ గా కూడా ఉంటుంది. హీరో కనిపిస్తే ఒళ్ళు మరిచిపోయి హీరో పైన పడే బజారుదానిలా (ఇలియానాలా ) Isabel Lucas తలాతోకా లేని పాత్రలో కనిపిస్తుంది. కాస్తో కూస్తో నటనకు అవకాశమున్న పాత్రలో John Turturro కనిపిస్తాడు కానీ ఆ పాత్ర సీరియస్ పాత్రో కామెడీ పాత్రో అర్థం కాదు.

ఈ సినిమాకు Rotten Tomatoes వెబ్‌సైట్ 20%, IMDB 6.8 రేటింగ్ ఇచ్చాయంటే ఏమో అనుకున్నాను కానీ సినిమా చూసిన తర్వాత అర్థమయింది ఎందుకలాంటి రేటింగ్ ఇచ్చారో.  సినిమా అయిపోయాక థియేటర్లో కొందరు చప్పట్లు కొట్టారు....నేనూ కొట్టాను "హమ్మయ్యా సినిమా అయిపోయింది" అనుకుంటూ!

హాస్యచక్రవర్తి సుత్తి వీరభద్రరావు - మూడవ భాగం

Posted by జీడిపప్పు

సుత్తి వీరభద్రరావు పేరు వినగానే అందరికీ గుర్తు వచ్చే సినిమా "వివాహ భోజనంబు". రకరకాల ఆసనాలు వేస్తూ తన ఇంట్లో అద్దెకుంటున్న కవి అయిన బ్రహ్మానందానికి "సినిమా స్టోరీ" చెప్పే పాత్రను ఆయన పోషించారు. సినిమా రచయిత కావాలనుకొనే బ్రహ్మానందం ఓ కథ చెబితే దాన్ని తీసిపారేసి ఊళ్ళు, సందులు, ఆహారపదార్థాల జాబితా చెప్పి ఇలా సినిమా తీయాలంటాడు. తెవికీనుండి సంగ్రహించిన ఆ సరదా సంభాషణలు:

మట్టి పూసుకొని ఉన్నపుడు బ్రహ్మానందం సంభాషణ--(ఏడుపు గొంతుతో) ఈ చెమ్మంతా ఇగిరేలోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాఏమో మహాప్రభో. ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే . జూవాళ్ళు చూస్తే వాళ్ళ కోతులు తప్పించుకొచ్చాయని పట్టుకెళ్ళి పోతారు. జనమెవరయినా చూస్తే ఇతర గ్రహాలనుండి వచ్చారనుకొని రాళ్ళుచ్చుక్కొడతారు... (ఆశగా ) ఇంక ఎంచక్కా కడిగేసుకుందామా మహాప్రభో.

కధ చెప్పమని--ఈ కథ సినెమాగా తీస్తే నేను అడుక్కుతినాల, ఓ వూరు వూరంతా పస్తుండి నాకు ముష్టెయ్యాల్సొస్తుంది. అరే ఇన్నాళ్ళనుండి సూత్తన్నాను. సినిమాకు పనికొచ్చే ఒక కథ కూడా సెప్పలేనోడివి నువ్వేం కవివయ్యా అసలు. నేనొక గొప్ప కథ సెప్తాను ఇనుకో.మధ్య తరగతి ఎదవనాయాలా.

మహాప్రభో తమరు నన్ను తిట్టారా?

లేదు సినిమా పేరు చెప్పా--ఆ పేరు తిట్టులా ఉంది మహాప్రభో --పేరులో తిట్టుంటేనే సినిమా హిట్టవుద్దయ్యా

తెర లెగవంగానే ఈరో ఒక కాఫీ ఓటల్కు ఎల్తాడు. సర్వర్ రాగానే ఈరో ఏమున్నాయి అని అడిగాడు. అప్పుడు సర్వరు "ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, గారె, మషాలా గారె, ఉప్మా, కిచిడీ, పెసరట్టు, మినపట్టు, రవ్వట్టు, మషాలా అట్టు, బాత్తు, టమేటా బాత్తు, బోండా, బజ్జీ, మైసూరు బజ్జీ, మిరపకాయ బజ్జీ, అరిటికాయ బజ్జీ, తమలపాకు బజ్జీ, లడ్డు, బందరు లడ్డు, రవ్వ లడ్డు, మిఠాయి, పీచు మిఠాయి, బందరు మిఠాయి, బొంబాయి మిథాయి, కలకత్తా మిఠాయి, జాంగ్రీ, పాలకోవా,హల్వా, మైసూరు పాకు, అమలాపురం కాజా, భీమవరం బాజా, పెద్దాపురం కూజా" ఉన్నాయంటాడు.

అప్పుడు ఈరో "అట్టు తే" అన్నాడు

అప్పుడు సర్వరు " యే అట్టు? పెసరట్టా, మినపట్టా, రవ్వట్టా, మషాలా అట్టా, 70mm అట్టా, MLA అట్టా, నూనేసి కాల్చాలా నెయ్యేసి కాల్చాలా, నీళ్ళోసి కాల్చాలా, పెట్రోలు పోసి కాల్చాలా, కిరసనాలు పోసి కాల్చాలా, డీజిలేసి కాల్చాలా, అసలు కాల్చాలా వద్దా " అని అడిగాడు

అప్పుడు ఈరో పెసరట్టు నెయ్యేసి కాల్చమన్నాడు, కాఫీ కూడా తెమ్మన్నాడు

అప్పుడు సర్వరు "యే కాపీ మామూలు కాపీయా,స్పెసలు కాపీయా, బుర్రూ కాపీయా, నెస్కాఫీయా, బ్లాక్ కాఫీయా, వైటు కాఫీయా హాటు కాఫీయా, కోల్డు కాఫీయా , నురుగు కావాలా వద్దా, కావాలంటే ఎన్ని చెంచాలు " అని అడిగాడు

అప్పుడు ఈరో మామూలు కాపీ తెమ్మన్నాడు

అప్పుడు సర్వరు "నీలగిరి కాపీయా, హిమగిరి కాపీయా, సిమలా కాపీయా'

ఆపండి మహాప్రభో, తమలో ఇంత వూహాశక్తి ఉందని వూహించలేకపోయాను. ఈ కథనే సినిమాగా తీసుకోండి. పది వేల రోజులు ఆడుతుంది జనం వ్రుద్దులై పండి రాలిపోయేంత వరకు, కలియుగాంతం వచ్చి సర్వ ప్రాణి నాశనం అయిపోయేంత వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది మహాప్రభో నన్ను వదిలెయ్యండి మహాప్రభో నన్ను వదిలెయ్యండి

                                                     ********  
మహాప్రభో అద్దె బాకీ మాఫీ చేస్తానని తమరు నన్నిలా శంకుస్థాపన టైపులో పాతిపెట్టి తమరలా విష్ణుమూర్థిలా పడుకోవడం ఏమీ బాగలేదు మహాప్రభో

నిన్ను నేను పాతిపెట్టాను కదా, నన్ను పాతి పెట్టే మడిసి కోసం సూత్తన్నానయ్యా

Image and video hosting by TinyPic నన్ను తొరగా బయటకి లాగండి మహాప్రభో. ఏ ఊరకుక్కాన్నా దగ్గరికొచ్చి కాలెత్తిందంటే పావనమైపోతాను. లేదా యే అల్సేషనో ఇసుకలో బంతి పడిందని నా తల నొట కరుచుకొని వెళ్ళిపోతే కీర్తిశేషుడిని అయిపోతాను. చీ ముక్కు మీద దురద పుట్టినా గోక్కోలేని వెధవ బ్రతుకు అయిపోయింది నాది

స్షో ఆట్టే వాగావంటే తిత్తి తీస్తా. నువ్వు సెప్తున్న కథలో ఏదో లోపముందయ్యా కవీ. నేను ఆలోసించి పెట్టుకున్న సిన్న లైను ఇనిపిస్తాను ఇనుకో:

వో ప్యామిలీ మంగలగిరి తిరణాలకెల్తారు. ఆళ్ళ కొడుకు ఆరేళ్ళ గుంటడు ఆ జనంలో తప్పోతాడు. ఆడి తల్లిదండ్రులు ఆడికోసం బావురుమంటారు

ఆహా సెంటిమెంటు బాగుందండయ్యా. మొదటి సారిగా తమరు మెదడు వాడుతున్నారు, వాడండి

ఆడి తండ్రి ఆడికోసం వూళ్ళన్నీ గాలించడం మొదలుపెట్టాడు. యే యే వూళ్ళు తిరిగాడో తెలుసా?

ఐదరాబాదు, అదిలాబాదు, సికిందరాబాదు, అహమ్మాదాబాదు, ఫకీరాబాదు,అలహాబాదు, ఫరీదాబాదు. ఔరంగాబాదు, తనబాదు (??), సింధుబాదు,ముస్తాబాదు, ఫైసలాబాదు, గజియాబాదు, అబ్దుల్లాబాదు, జపారాబాదు, వుస్సేనుబాదు. (బ్రహ్మం ఏడుస్తూ) నా బొందబాదు, నా శ్రాద్దంబాదు, నా పిండాకూడు బాదు

ఆ ఆ ఆటన్నిటితో కలిపి మొత్తం ఇరవయ్యొక్క బాదులు ఎతికాడు. సివరాఖరికి యెవుడో ఆ గుంటడు బెజవాడలో ఉన్నాడని సెప్తే ఆ వూరెళ్ళాడు.

బెజవాడలోగవర్నరుపేట, లబ్బీ పేట, పున్నమ్మ తోట, భాస్కర్రావు పేట, సింగు నగరం, ప్రజాశక్తి నగరం, అయోధ్యా నగరం, ముత్యాలపాడు, గుణదల, గాంధీ నగరం, చిట్టి నగరం, మాచవరం, రోకళ్ళపాలెం, మారుతీ నగరం, మొగల్రాజపురం, భవానీపురం, సత్యన్నారాయనపురం, సీతారామపురం...

వద్దు బాబోయ్, చాలు మహాప్రభో చాలు, బెజవాడంతా వెతికేసాడనుకుందాం ఒక్క మాటలో సరిపోతుంది మహాప్రభో.

అన్నీ పేట్లెతికినా ఆ గుంటడు దొరకలేదయా, అప్పుడు...

పారిపోవడానికి కూడా వీలులేని పరిస్థిథిలో పడిపోయాను మహాప్రభో

ఇను ఇక్కడే ఇక్కడే తమాషగుంటంది అప్పుడు ఆడు రోడ్ల మీద పడ్డాడు. యే యే రోడ్ల మీద పడ్డాడో తెలుసా? బీసెంటు రోడ్డు, బందరు రోడ్డు, యేలూరు రోడ్డు, నక్కల రోడ్డు, టిక్కల రోడ్డు, కారల్ మార్క్సు రోడ్డు, గాంధీ రోడ్డు, వన్ టవును రోడ్డు, అద్దంకివారి వీధి, తాళంకివారి వీధి, దాసరివారి వీధి, మల్లెలవారి వీధి, పుల్లెలవారి వీధి, పూలబావి వీధి, కొత్తగుళ్ళ వీధి, మసీదు వీధి, వినోడా టాకీసు వీధి, అచ్చమామబ ఆస్పత్రి వీధి, మాంటిసోరి స్కూలు వీధి, హనుమంతరాయ గ్రంథాలయం వీధి...

మహాప్రభో ఆపండి, ఇది సినిమా కథా? ఈ లెక్కన పోస్ట్ మ్యాన్లు అత్యద్భుతమయిన సినిమా కథలు రాయగలరు. కుక్కొచ్చి కాలెత్తినా పందొచ్చి తల కొరికినా ఇంతకంటే సుఖంగా ఉంటుంది మహాప్రభో!!

                                                                              (మిగతా చివరి భాగంలో)

పుస్తకం.నెట్ నిర్వాహకులు జైలుకు - Season Finale

Posted by జీడిపప్పు

గత ఏడాది కాలంలో తెలుగు సాహిత్య రంగానికి సేవలు చేయడానికి ఎందరో తమవంతు కృషి చేసారు. "పుస్తకం హస్తభూషణం" అన్న మాటను ఆదర్శంగా తీసుకొని పుస్తకప్రియుల కోసం మంచి పుస్తకాల సమాచారాన్ని అందివ్వడానికి, పంచుకోవడానికి కొందరు "పుస్తకం.నెట్" అనే వెబ్‌సైట్ ప్రారంభించారు. చాలావరకు చక్కని చర్చలు జరిగాయి కానీ ఈ మధ్య ఆ చర్చలు శృతిమించి వ్యక్తిగత దూషణలవరకు వెళ్ళాయి. చివరకు పోలీసు కేసులు, FIRల వరకు వెళ్ళాయి అంటే పరిస్థితి ఎంతగా చేజారిందో తెలుస్తున్నది.

కత్తి మహేష్ గారు తనను కులం  పేరుతో దూషించారని కేసు పెట్టారు. మహేష్ గారి మాటల్లో:

"పుస్తకం డాట్ నెట్ లో చలంపై జరిగిన ఒక చర్చలో  నాపై కులపరమైన నింద చేస్తూ "
"బ్లాగుల్లో కంటెంట్ కామెంట్లతో సహా అన్నిటి బాధ్యతా బ్లాగరిదే. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే మోడరేషన్ బాధ్యత బ్లాగరి తీసుకుంటాడు కాబట్టి"
"కేసు పెట్టడానికి నేను దళితుడినైతే చాలు. ఒకసారి SC/ST (prevention of) atrocities act చదువుకోండి."

అంటే మహేష్ గారిని అన్నవారికంటే ఆ వ్యాఖ్య ప్రచురించిన పుస్తకం.నెట్ నిర్వాహకులదే తప్పు. వారే బాధ్యులు అన్నమాట. ఇక ఇది SC/ST atrocity act కింద వస్తుంది కాబట్టి ఎవరూ తప్పించుకోలేరు.

సదుద్దేశంతో ఒక వెబ్‌సైట్ మొదలు పెట్టిన నిర్వాహకులు కేసుల్లో ఇరుక్కొని కోర్టుల చుట్టూ తిరిగి జైలుకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడడం కడు శోచనీయం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పురావృతం అని కోరుకుందాము.

      *******                       *******                          *******

బ్లాగుల్లో జరుగుతున్న సందడికి నా తరఫున ఇప్పటికి మూడు ఎపిసోడ్లు ప్రసారం చేసాను. ఈ నాలుగో ఎపిసోడ్‌తో ఈ మొదటి సీజన్ ముగిస్తున్నాను. అసలేమి జరిగింది, ఏమి చేసాము, ఏమి సాధించామో సింహావలోకనం చేసుకుందాము.

ముందుగా - ఒక కోన్ కిస్కా గొట్టం గాడు వచ్చి "అర్జునుడు భీముడికి బామ్మర్ది అవుతాడు తెలుసా" అన్నపుడు లేదా ఉడతలుపట్టే చిడతల చిన్నారావు "పంచపాండవులు పంచలే కట్టుకుంటారని సాక్ష్యం లేదు" అన్నపుడు ఒక సగటు వ్యక్తి భావనలలో/ఆలోచనలలో వెంట్రుకంత కూడా మార్పు ఉండదు. వినేవాడు ఒకటో తరగతి పిల్లవాడూ కాదు, చెప్పేవాడు ఒక మూర్ఖుడని అందరికీ తెలుసు. కొందరు "మనకెందుకులే ఈ బురదలో రాయి వేయడం" అని ఊరకుంటారు. నా గురించి బాగా తెలిసిన మా గురువుగారు తెలుగోడుగారు ఒకసారి "పడుకున్న గాడిదను లేపి తన్నించుకోవడం నీకు భలే ఇష్టం కదా" అన్నారు. నిజమే! రెండు తన్నించుకొని నాలుగు తన్ని దురద తీర్చుకొనే నాలాంటి వాళ్ళు ఈ చెత్త చదివి కాస్త చిరాకుతో కొన్ని కామెంట్లు/పొస్టులు వేస్తుంటారు తప్పించి ఈ మతగజ్జి మూర్ఖుల వల్ల అర్థనయాపైసా నష్టం లేదు.

ఇక బ్లాగుల్లో వివాదం సంగతి:  కత్తి మహేష్ కుమార్ గారు తనపైన వచ్చిన "కుల వివక్ష" గురించి చెప్పారు. అందరూ అంగీకరించాల్సిన విషయమే. నలుగురు కులస్తులు కలిసే చోటు ఏది? గుడి. అంటే కులం కంటే మతం గొప్పదిగా భావించేవారే ఎక్కువ కదా. మరి అలాంటి మతాన్ని
""ఈ రామాయణం ప్రకారం సీత రాముడికి సోదరి అవుతుంది. వయసులో చిన్నది కాబట్టి చెల్లెలన్నమాట....ఈ బౌద్ధజాతక కథ ప్రకారం, దశరధుడు అయోధ్యకు కాదు, వారణాశికి రాజు. అంటే కాశీరాజన్నమాట. అతనికి రామపండితుడు, లక్ష్మణకుమారుడు, సీత అనే పిల్లలు.... ఇక అన్నాచెళ్ళెల్ల వివాహం అంటారా, అప్పటి రాచరికంలో incestuous పెళ్ళిళ్ళు ఉండే అవకాశం పెద్ద ఆశ్చర్యకరం ఏమాత్రం కాదు. అమలి రాచరికపు రక్తం పేరుతో ఇలాంటి సాంప్రదాయాలు చరిత్రలోని చాలా రాచరికాల్లో ఉండటం మనకు తెలిసిందే." 
 "వ్రతాలు ఏ వేదాల్లో ఉన్నాయో కాస్త చూసిచెప్పండి! వేదకాలంలో చిల్లరదేవుడైన విష్టువు అత్యంత శక్తివంతుడైన దేవుడుగా ఎలా ఎదిగాడో కాస్త కనుక్కుని చెప్పండి! శివుడు త్రిమూర్తుల్లో ఒకడెప్పుడయ్యాడో కాస్త ఆరాతియ్యండి!"
 లాంటిమాటలతో మహేష్ గారు హేళన చెయ్యడం న్యాయమా? "బ్రాహ్మినికల్ యాటిట్యూడ్" అంటూ రకరకరాల నిర్వచనాలు చెప్పి అవతలివారితో "దళిత్ యాటిట్యూడ్" అనిపించుకొని  "కేసు పెట్టడానికి నేను దళితుడినైతే చాలు. ఒకసారి SC/ST (prevention of) atrocities act చదువుకోండి." అనడం ఎంతవరకు సమంజసం?

నేనేదో హిందూమత పరిరక్షకుడినో, హిందూన్మాదినో కాదు. సుష్టుగా వారానికి ఏడు రోజులూ చికెన్ బిర్యానీ తిని ఎన్నో ఏళ్ళనుండి దేవుడికి ఒక్కసారయినా మొక్కని నేను ఇలా ఎందుకు స్పందిస్తున్నానంటే.. i don't like this crap of insulting/mocking/scrutinizing religious stuff thus hurting one's beliefs.

ఇక ఈ నాలుగురోజుల సీజన్‌లో ముఖ్యంగా చెప్పుకోవలసినది బ్లాగరుల విశేష స్పందన. పదుల కొద్దీ పోస్టులు (పూర్తి జాబితా), వందల కొద్దీ కామెంట్లతో ఆద్యంతం ఆహ్లాదకరంగా, వినోదాత్మకంగా, పండుగవాతావరణాన్ని తలపింపచేసారు. "కేసు పడుద్ది" "నీ ఐపీ అడ్రస్ నాకు తెలుసు" "అట్రాసిటీ కేసు పెడతా" "ఏం పీక్కుంటావో పీక్కో" "నీది xyz యాటిట్యూడ్" లాంటి మాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. ముందు ముందు ఈ మాటలతో చాలా హాస్యం వెల్లివిరుస్తుందన్న విషయంలో అణుమాత్రమనుమానం లేదు.

కేవలం నాలుగు ఎపిసోడ్లతో ఈ సీజన్ ముగించడానికి కారణాలంటూ పెద్దగా ఏమీ లేవు. కాకపోతే ఈ చెత్త ఎక్కువయితే కంపు ఎక్కువవుతుంది. మోతాదు మించితే వెగటు పుడుతుంది. దీనికి తోడు నేను వ్రాయాలనుకున్న ఒకటో రెండో వెనకపడుతాయి. ఈ గొడవలు ఇప్పటికీ ఎప్పటికీ ముగియవు. తొందర్లో సీజన్ 2 ఎపిసోడ్ 1 లో మళ్ళీ సందడి చేద్దాం. 2-3 రోజుల్లో నా మామూలు పోస్టులతో మళ్ళీ కలుస్తాను.

మీకు సూచనలిచ్చేటంతటివాడిని కాకపోయినా ఓ రెండు ముక్కలు: ప్రత్యక్ష దూషణకు దిగకండి. తెగే దాకా లాగినా ఫర్వాలేదు కానీ తెగనివ్వకండి. తెగితే మనకు కావలసిన ఎంటర్‌టైన్‌మెంట్ దొరకదు. ఇది గుర్తించుకొని హాస్య/వ్యంగ్య మాటలతో హాయిగా నవ్వుకుందాము.

Take care now, bye bye then!

Image and video hosting by TinyPic

శాంతించండి బ్లాగరులారా.. సంస్కృతిని కాపాడండి

Posted by జీడిపప్పు

శాంతించండి బ్లాగరులారా. అన్యోన్యంగా కలసిమెలసి ఉండవలసిన మీరు దూషించుకొనుచున్నారని తెలిసి ఇలా వచ్చాను. మీరందరూ విద్యావంతులే, ఉన్నత చదువులు చదువుకున్నవారే. సంగీత సాహిత్య భక్తిరసాది విషయాల జ్ఞానాన్ని పరస్పరం పంచుకొనక ఈ విభేదాలు ఎందుకు? భగవత్ప్రసాదమయిన మేధస్సును ఎంతో ఉపయోగకరమైన పనులకు వినియోగించక ఎందుకూ కొరగాని అభిప్రాయభేదాలతో వ్యర్థం చేసుకొనుట మానండి.

కత్తి మహేష్ కుమార్ అను బాలకుడు "ఇవే గొప్పోళ్ళ వేషాలు. ఇదే సంస్కృతిని కాపాడే విధానం" అన్నాడు. ఈతడి హృదయం ఎంత గాయపడి ఉంటే ఆ మాట అంటాడు. ఎందుకు నాయనలారా ఇతడిని నొప్పిస్తున్నారు? మన సంస్కృతి పట్ల ఇతడికున్న ఆరాధన భావం నాకు తెలుసు నాయనలారా. అలాంటి ఇతడు బాధగా "ఇదే సంస్కృతిని కాపాడే విధానం" అన్న మాటలు చూసి నా మనసు కకావికలయినది.

చిరంజీవులారా, అన్ని జన్మల్లోకెల్లా మానవజన్మ ఎంతో ఉదాత్తమయింది మరియు క్షణభంగురమయినది. పుట్టిన మానవుడు ఏ క్షణానయినా మరణించవచ్చు. జీవించి ఉన్నన్నాళ్ళూ పరస్పర అనురాగాభిమానాప్యాయతలతో కలసిమెలసి ఉండక "బ్రాహ్మనికల్ యాటిట్యూడ్" "దళిత్ యాటిట్యూడ్" అంటూ దూషించుకోవడం భావ్యం కాదు.

చిన్నారి బాలలారా -  చనిపోయినవారితో తల్లిదండ్రులు, భార్య-పిల్లలు, అన్నదమ్ములు, బంధుమితృలు ఎవరూ  రారు. కేవలం ఆత్మ ఈ శరీరాన్ని విడిచి వెళ్తుంది. మనిషి మరణిస్తే చేసిన పాపపుణ్యాల ఆధారంగా స్వర్గానికో నరకానికో వెళ్ళవలసి వస్తుంది. పాపాలు చేసినవారు నరకానికి తీసుకెళ్ళబడతారు. అక్కడ నిప్పుల ఎడారి పైన నడిపిస్తారు. ఆకలిగొన్న శునకములు వెంటాడి వేటాడుతాయి. పాప పరిహారముగా మానవుల రక్తమాంసాలున్న నదులలో మునగవలసివస్తుంది.

దేవుడిచ్చిన అవకాశాన్ని వ్యర్థం చేసుకొని శుష్క యుద్దాలతో, వ్యర్థ ప్రసంగాలతో పాపం చేసి ఆత్మను క్షోబింపచేయు బదులు సత్ప్రవర్తన కలిగి సన్మార్గంలో పయనించండి నాయనలారా. సన్మార్గమనిన ఇతరులను దూషించకుండుట, ఇతరులను గౌరవించుట, పెద్దలను సేవించుట, పెద్దలు చెప్పిన సంస్కృతి సంప్రదాయాలను ఆచరించుట.

సంస్కృతిని ఆచరించుట ఎలాగుయనిన - అనాదిగా వస్తున్న వేదవేదాంగాలలోని మంచిని గ్రహించి దైనందిన జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి. ఉదాహరణకు రామాయణం యుగయుగాలుగా గౌరవింపబడుతున్నది. అందులో సీతారామ కల్యాణం ఒక సుమనోహర ఘట్టం. ఆ కళ్యాణం ఎంతో వీనులవిందుగా జరిగినదని వర్ణిస్తారు. దాన్ని ఆదర్శంగా తీసుకొని కనులపండుగగా శ్రీరామనవమి జరుపుకోవడం సంస్కృతిని గౌరవించడం అవుతుంది.

"ఇదే సంస్కృతిని కాపాడే విధానం." అంటూ ఆవేదన వ్యక్తం చేసిన కత్తి మహేష్ కుమార్ ఏమన్నాడో చూడండి:

కానీ నేను ఆపని చెయ్యను."ఓహో మొల్లకాలంలో తెలుగు దేశంలో ఇలా పెళ్ళిళ్ళు జరిగేవన్నమాట" అనే నిర్ధారణకు వస్తాను. ఎందుకంటే,రాముడు ఉన్నాడు అన్న కాలంలో పట్టుపీతాంబరాలు ఉండే అవకాశం ఉందా? తిలకాలుకాటుకలూ దిద్దేవారా? కంకణాలు తొడిగేవారా? మంగళవాయిద్యాలు కె.వి.మహదేవన్ తరహాలో వాయించేవారా? అసలు ఉంటే ఉత్తరభారతీయుడైన రాముడు మాంగళ్యధారణ సాంప్రదాయాన్ని పాటించేవాడే? అనే సమాధానం లేని ప్రశ్నలు ఇక్కడ అవసరం గనుక. మొల్ల తన కాలమాన పరిస్థితుల్నీ, సాంప్రదాయాల్ని బట్టి తనదైన వర్ణన చేసుంటుందనే నిర్ధారణకు వస్తాను.

ఆ వర్ణనతో పాటూ భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిగే విధానం ఎప్పటి నుండీ ప్రారంభమయ్యింది. వారు పాటించే సాంప్రదాయాలకు మూలం ఎక్కడ.ఉత్తరభారతదేశంలో ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయా వంటి ప్రామాణికాలు వెదకి మూలాలను గ్రహించి, పరిశోధన ఫలితాల్ని ప్రతిపాదిస్తాను.

అలాగే దంపతులు అన్నమాటకు సీతారాములను ప్రతీకగా చెప్పుకుంటూ ప్రతి ఇంటా కొలుస్తూ సంస్కృతిని ఆచరిస్తారు అందరూ. "సంస్కృతిని కాపాడే" కత్తి మహేష్ కుమార్ ఏమంటున్నాడో చూడండి:

"ఈ రామాయణం ప్రకారం సీత రాముడికి సోదరి అవుతుంది. వయసులో చిన్నది కాబట్టి చెల్లెలన్నమాట....ఈ బౌద్ధజాతక కథ ప్రకారం, దశరధుడు అయోధ్యకు కాదు, వారణాశికి రాజు. అంటే కాశీరాజన్నమాట. అతనికి రామపండితుడు, లక్ష్మణకుమారుడు, సీత అనే పిల్లలు.... ఇక అన్నాచెళ్ళెల్ల వివాహం అంటారా, అప్పటి రాచరికంలో incestuous పెళ్ళిళ్ళు ఉండే అవకాశం పెద్ద ఆశ్చర్యకరం ఏమాత్రం కాదు. అమలి రాచరికపు రక్తం పేరుతో ఇలాంటి సాంప్రదాయాలు చరిత్రలోని చాలా రాచరికాల్లో ఉండటం మనకు తెలిసిందే."
వ్రతాలు ఏ వేదాల్లో ఉన్నాయో కాస్త చూసిచెప్పండి! వేదకాలంలో చిల్లరదేవుడైన విష్టువు అత్యంత శక్తివంతుడైన దేవుడుగా ఎలా ఎదిగాడో కాస్త కనుక్కుని చెప్పండి! శివుడు త్రిమూర్తుల్లో ఒకడెప్పుడయ్యాడో కాస్త ఆరాతియ్యండి!

ఆహా ఎంత బాగా చెప్పాడు. చూసారా ఈతడు ఎంత చక్కగా సంస్కృతిని కాపాడుతున్నాడో!!
ఇంకా "మన సంస్కృతి రహస్యకుతి అనుభవించే అద్భుతమైన సంస్కృతి. "  అన్నాడు. ఇలా మన సంస్కృతిని కాపాడుతున్న మహేష్ కుమారును నొప్పించకండి నాయనలారా. రహస్యకుతి అనుభవించే అద్భుతమైన సంస్కృతిని కాపాడండి. నా ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి.

- భగవాన్ శ్రీ శ్రీ శ్రీ బుడుగు బాబా

ముసుగువీరుడి అసలు రూపం

Posted by జీడిపప్పు

చాలా రోజుల తర్వాత బ్లాగుల్లో మళ్ళీ "ఆ సందడి" నెలకొన్నది. కామెడీ కరువైపోతున్న బ్లాగుల్లో ఒక బ్లాగరు "కేసు పెడతా" అంటూ పోస్టు వేసి కడుపుబ్బా నవ్వించి మిగిలినవాళ్ళు కూడా కేసులు వేయడానికి ఆదర్శమయ్యారు. ఈ entertainment కనీసం వారం రోజులు కొనసాగాలని ఆశిద్దాం. ఈ సందర్భంగా అందరికీ ఒక మనవి/విన్నపం: పొరపాటున కూడా నోరు జారకండి. ఎవరినీ ప్రత్యక్షంగా తిట్టకండి. వీలయినంతవరకు పరోక్షంగానే తిట్టండి. ఉదా: సుత్తి నరేష్ కుమార్ ను తిట్టాలంటే "నత్తి" అనడం.. అలాగన్నమాట. ఇది ఎందుకు చెబుతున్నానంటే ఒక బ్లాగరు ఇలా అన్నారు: "కేసు పెట్టడానికి నేను దళితుడినైతే చాలు. ఒకసారి SC/ST (prevention of) atrocities act చదువుకోండి." తస్మాత్ జాగ్రత్త. ఆ విధంగా మనమందరం ముందుకు పోదాం.

ఇప్పటిదాకా కేసుల గురించి వెలువడిన పోస్టుల జాబితా:
మలక్పేట్ రౌడీ గారి పైన కేసు పెడుతున్నా 
IP address ద్వారా కులం కనిపెట్టడం ఎలా? 
సైబర్ నేరం, మర్యాద!! ఉఫ్ - బడే హోజావ్ బచ్చే
కత్తి మహేష్ ఎ౦దుకు వివాదాస్పదుడవుతున్నాడు - నా దృక్కోణ౦ :)
కొణతం దిలీప్ గారికి నా సమాధానం
నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు - ఓ బెకబెక
బ్రాహ్మణ ద్వేషం - ఒక ఆటిట్యూడ్  

IT లో ఉన్నవాళ్ళకు బాగా తెలుసు on-call గురించి. ఎప్పుడు ఫోన్/మెయిల్ వస్తుందో తెలియదు. బయట వెళ్ళలేము, ఎక్కువ టైం తీసుకొనే ఏ పనీ చెయ్యలేము. ఇలాంటప్పుడు మంచి టైం పాస్ కిటికీలోనుండి చూస్తూ చెట్టు ఎక్కుతున్న, దిగుతున్న ఉడతలను లెక్కపెట్టడం.. లేదా.. ఇదిగో ఇలాంటి పోస్టు వెయ్యడం!

అసలు విషయానికొస్తే -  బ్లాగుల్లో వ్యక్తిగత దూషణ తప్పు, నేను అలాంటివాటికి వ్యతిరేకం అన్నారు కత్తి మహేష్ గారు. నేను నూటికి.. well.. 92.5 శాతం (ఇదొక FM రేడియో) అంగీకరిస్తాను. ఇంకా "సత్ప్రవర్తన గల" మహేష్ గారు ఇలా అన్నారు "బ్లాగుల్లో కంటెంట్ కామెంట్లతో సహా అన్నిటి బాధ్యతా బ్లాగరిదే. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే మోడరేషన్ బాధ్యత బ్లాగరి తీసుకుంటాడు కాబట్టి." ఈ సారి 102.5 శాతం (ఇది ఇంకో FM రేడియో, రేడియో జాకీ చాలా హాట్ గా ఉంటుంది ఫోటోలో) అంగీకరిస్తాను. ఈ మాటలను ఎవరయినా చూస్తే "ఆహా ఈ మహేష్ గారు ఎంత ఉన్నత భావాలు కలవారు. ఎవరినీ నొప్పించరు, నొప్పించకూడదని చెప్తున్నారు" అనుకుంటాము కదా!

అదేంటో కానీ నాకు ఈయన ఒక ముసుగువేసుకొన్న "ముసుగు వీరుడు" అనిపిస్తాడు. పైకి మాత్రం "వ్యక్తిగత దూషణ ఉండకూడదు" అంటూనే స్వయానా తన బ్లాగులో కామెంట్ల మోడరేషన్ పెట్టి మరీ ఇంకొకరిని దూషిస్తున్న మాటలను తన బ్లాగు పోస్టులో ఆమోదిస్తాడు. ఇదేమి "రహస్య కుతి"??  పైకి శ్రీరంగ నీతులు చెప్పడం, తన బ్లాగులో మాత్రం ఇంకొకరిని తిట్టించడం.. ఇదెక్కడి న్యాయం ఉప్మా!!!

అన్నట్టు "ఇలా బూతులు తిట్టడం చట్ట రీత్యా నేరం కాబట్టి బూతులను ఆమోదించిన బ్లాగర్ల పైన కేసులు పెట్టు" అంటారా?? సారీ.. ముందు ఉడతలను లెక్క పెట్టాలి/పట్టాలి!!

మలక్పేట్ రౌడీ గారి పైన కేసు పెడుతున్నా

Posted by జీడిపప్పు

ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుంది. చాలా రోజులుగా చూస్తున్నాను ఈ వ్యవహారం. ఏదో ఒకసారంటే పరవాలేదు కానీ ఇలా రెండు సార్లు చేయడం మాత్రం పద్దతి కాదు. ఒకసారి "పిట్స్‌బర్గ్ పిచ్చమ్మ" అంటూ పిట్స్‌బర్గ్ లో ఉన్న తెలుగు స్త్రీలను పిచ్చివాళ్ళుగా అభివర్ణించారు. మరోసారి టెక్సస్ తిగరిబుచ్చి అంటూ టెక్సస్‌లో ఉన్న తెలుగు స్త్రీలను తిగరబుచ్చిలంటూ అన్నారు. అటు పిట్స్‌బర్గ్ లో ఇటు టెక్సస్‌లో తెలుగు స్త్రీలు రౌడీ ఆగడాలను భరించలేకున్నారు. పిట్స్‌బర్గ్ తెలుగు అసోసియేషన్ "పిటా", టెక్సస్ తెలుగు అసోసియేషన్ "టెక్స్టా" లతో మాట్లాడాను. కేసు పెట్టమన్నారు. రౌడీ గారి IP Address దొరికింది. ఇక తప్పించుకోలేరు రౌడీ గారు.

మలక్పేట్ రౌడీ అని ముసుగేసుకున్న ఈ బ్లాగరు వివరాలను మితృలసాయంతో తెలుసుకున్నాను. ఈ ముసుగుదొంగ అసలు స్వరూపాన్ని బయటి ప్రపంచానికి తెలియజెప్పాలనే మనసు చంపుకొని ఆ వివరాలు బహిర్గతం చేస్తున్నాను (అందరూ గుర్తుపట్టాలని ఫోటో కూడా జత చేసాను) తప్పించి సదరు బ్లాగరు పైన వ్యక్తిగత కక్షలు లేవు.





అన్నట్టు బ్లాగులోకాన్ని చెత్తనుండి కాపాడిన ఏకలింగం గారు కత్తి రాందాసు : శవం తమ్ముడిదయినా కంపు కామనే అన్నా  అని ఓ పోస్టేశారు ఇప్పుడే. ఎవరయినా కేసులు పెట్టాలనుకుంటే వెంటనే పెట్టెయ్యండి.

నాకు నచ్చని విధంగా కామెంట్ వేసే వారికి హెచ్చరిక: మీ IP Address నాకు తెలుసు. మీ పైన atrocity కేసు పెడతాను. నా బ్లాగు అడ్రస్ ఇస్తూ incriminating వ్యాఖ్యలు చేస్తే that amounts to cheating and impersonating. IPC సెక్షన్ 420 మరియూ దాని సన్ సెక్షన్స్ సమానమైన సైబర్ నేరాల పరిధిలోకి ఈ విషయం వస్తుంది. మీరు హైదరాబాద్ లోనే ఉంటే 23240663, 27852274 ఫోన్ చేసి కనుక్కోండి. (Source )

హాస్యబ్రహ్మకు నివాళి

Posted by జీడిపప్పు

'నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం' అంటూ నలుగురికీ నవ్వులను పంచిన హాస్యబ్రహ్మ కలం నుండి వెలువడిన సంభాషణల గురించి, దర్శకత్వంలో వచ్చిన ఆణిముత్యాల గురించి, సృష్టించిన పాత్రల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.  ఆయన ఉన్నట్టుండి "ఇక నవ్వించలేను.. నవ్వించకుండా ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోతున్నా" అంటూ 2001 జూన్ 19 న వెళ్ళిపోయారు. 

జంధ్యాల గారి గురించి శ్రీనివాస్ పప్పు గారు వ్రాసిన "హాస్యబ్రహ్మ (జంధ్యాల) స్మృతిగా ఈ నా చిన్న కానుక

హాస్యచక్రవర్తి సుత్తి వీరభద్రరావు - రెండవ భాగం

Posted by జీడిపప్పు

ఆనందభైరవి చిత్రం తర్వాత బాలక్రిష్ణ హీరోగా నటించిన "బాబాయ్ అబ్బాయ్" చిత్రంలో సుత్తి వీరభద్రరావు రెండో హీరో పాత్ర పోషించారు. కనిపించినవాడినల్లా అప్పు అడుగుతూ, అబ్బాయికి సలహాలు ఇచ్చే పాత్ర ఇది. అనాధలయిన వీరిద్దరి కలయికే తమాషాగా ఉంటుంది. సినిమాల్లో ఏడుపు సన్నివేశాలు చూసి ఏడుస్తూ ఇంటికి వెళ్ళి తన తల్లికి సినిమా కథ చెప్పే అరుణ (శ్రీలక్ష్మి) ని "పేరులోనే రుణం" కూడా ఉందని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు కానీ, ఉద్యోగం సద్యోగం లేదని కూతురిని కాపురానికి పంపనంటాడు ఈయన మామ. దాంతో తప్పనిసరయి ఈయన అబ్బాయితోనే ఒక ఇంట్లో అద్దెకుంటూ అద్దె కట్టలేక ఓనరుకు మస్కా కొడుతూ అపుడపుడు పట్టుబడుతూ ఉంటారు.

ప్రతిదానికీ "త్తరై, నా త్తరై" అనడం ఈయన ఊతపదం. తమిళంలో "ఇస్తా, నేను ఇస్తా" అని దీనర్థం. అప్పు ఎప్పుడు తీరుస్తావు అని అప్పులిచ్చినవాళ్ళు అడిగినపుడల్లా "త్తరై, నా త్తరై" అంటూ ఇంటిదగ్గరున్న బీచ్‌లో ఓ మీటింగు పెట్టి  "శ్రీక్రిష్ణదేవరాయలవంటి కళాహృదయుడు తన మంత్రికి అప్పాజీ అని పేరు పెట్టుకున్నాడంటే అప్పు ఎంతవిలువయిందో గ్రహించండి. ఇంగ్లీషులో కూడా డౌను కంటే అప్పు ఉన్నతమయిందా కదా" అంటూ అప్పు గురించి స్పీచ్ ఇస్తాడు.

తనకు దారిలో కనిపించిన ఒక వ్యక్తితో జరిగే సంభాషణ:
"గుడ్మార్నింగ్ సార్, మీరు వైద్యుడా"
"భూతవైద్యుడిని"
"ఆహాహా అప్పిచ్చువాడు వైద్యుడు అన్న సుమతి శతకంవారు ఎంత గొప్పవారండీ"
"ఇంతకీ మీరూ.."

"దేశభక్తి వీరభద్రాన్ని. ఒక భారత పౌరుడిగా దేశభక్తి కలిగి ఉండడం తప్పంటారా?"
"అబ్బెబ్బెబ్బే తప్పెలా అవుతుందండీ"
"అన్నారా, అయితే దొరికిపోయారన్నమాటే. నా త్తరై"

"మన భారతప్రభుత్వం చేసిన పని మనమూ చేయడం తప్పు కాదు కదా. మన దేశం అహింసను పాటిస్తే మనమూ పాటిస్తాము. మన దేశం క్రమశిక్షణను అనుసరిస్తే మనమూ అనుసరిస్తాము. ఇప్పుడు మనదేశమేమి చేస్తూందీ? పరాయిదేశాలనుండి వీరలెవల్లో అప్పులు చేస్తోంది. ఈ ఏడాది ప్రపంచబ్యాంకుకు ఎక్కువ అప్పున్న దేశాల్లో మొదటిది భారతదేశమూ, రెండవది బెల్జియమూ. అంచేత అప్పు చెయ్యడం తప్పు చెయ్యడం కాదు. ఆ మాటకొస్తే అప్పుచెయ్యడం భారతీయుడి జన్మ హక్కు, ప్రథమ కర్తవ్యమూనూ.ఏడుకొండలవాడు కుబేరుడి దగ్గర అప్పు తీసుకొని ఇప్పటికీ వడ్డీ కడుతున్నాడు. నేలనుంచి ఆకాశం నీరు అప్పు తీసుకుని వర్షం పేరుతో ఇన్స్టాల్మెంట్లలో బాకీ తీరుస్తోంది. చంద్రుడు సూర్యుడినుండి వెలుగు అప్పు తీసుకొని ప్రకాశిస్తున్నాడు. ఇంతెందుకు..మీరు భూతవైద్యులు కదా, పంచభూతాలేవో చెప్పండి"

"అయ్యా పంచభూతాల సంగతేమో నాకు తెలీయదు కానీయండి.. ఇప్పుడు నాకు ప్యాంటుభూతమొక్కటే కనపడుతున్నది"
"నీ సెన్సాఫ్ హ్యూమరుకి నిప్పెట్టా. భూత జోకులెయ్యకండి మేష్టారూ. అసలు పంచభూతాలేమిటీ? పృధ్వివ్యాప్పస్తేజోవాయురాకాశాలు. పృథ్వి, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశమని. అలా అప్పు అనేది మన పవిత్ర పంచభూతాల జాబితాలో ఉంది. ఏషియాడ్‌లో మన గుర్తు గున్నఏనుగు పేరు ఏమిటి? అప్పు. మన వైజాగ్ పక్కనున్న సిమ్హాచలం దేవుడి పేరేమిటి? సింహాద్రి అప్పన్న" ఇలా అప్పులగురించి "అప్పోదేశం" చేస్తుంటాడు.

 ఈ సినిమా తర్వాత జంధ్యాల సినిమా అని ప్రేక్షకులకు పెద్దగా తెలియని నరేష్, భానుప్రియ జంటగా నటించిన "మొగుడు పెళ్ళాలు" చిత్రంలో నరేష్ తండ్రి పాత్ర పోషించాడు. ఇందులో ఈయన పాత్ర బాగా డబ్బున షావుకారు పాత్ర. తిట్లు కాని తిట్లతో, వింత వింత పదాలతో అందరికీ తిక్క పుట్టిస్తుంటాడు. అందులో కొన్ని:

"ఏమిటా కంగారు.. గుడిమెట్లమీద ఎండుచేపలమ్ముకొనే మొహం నువ్వునూ. పగటికలలు కంటావా కిష్యోటికా" "కిష్యోటికానా? అంటే?" "తెలీదు. మాట బాగుందని వాడాను" "శీతాకాలంలో కూజాలమ్ముకొనే మొహం నువ్వునూ. నన్ను స్క్రూలూజు అనే లెవలుకు వచ్చేశావట్రా ఇతియోకినారా" "మల్లెపూలకోసం వేపచెట్టే మొహం అదీనూ"  "పెరుగులో నెయ్యేసుకొని తినే మొహం వాడూనూ" "లతసుమపినాకీ. అంటే ఏమిటని అడగకు. ఆ మాటకూడా నీలాగే అందంగా ఉందని వాడాను" "అనకాపల్లి వెళ్ళడానికి విశాఖపట్నంలో ఓడ ఎక్కే మొహం"  "పండు పడేసి తొక్క తినే తిక్కసన్నాసీ" "మొజాయిక్ ఫ్లోర్ పైన ఆవాలు పోసి కొత్తిమీర మొలవలేదని ఏడ్చే మొహం"

ఈ సినిమా జంధ్యాల సినిమాలా అనిపించదు. అందుకే ఎవరికీ పెద్దగా తెలియదు. అన్నట్టు ఈ సినిమా ప్రారంభంలో దాదాపు 10 నిమిషాలపాటు భవిష్యత్తులో ఆడవాళ్ళు మగవాళ్ళలా, మగవాళ్ళు ఆడవాళ్ళలా ప్రవర్తిస్తుంటే ఎలా ఉంటుందో హీరో కలకంటాడు. దీనినుండే జంధ్యాలగారి శిష్యుడు (క్షమించాలి..ఇది నిజం!)  ఈవీవీ బూతునారాయణ స్పూర్తిపొంది "జంబలకిడిపంబ" తయారుచేసాడు!

Image and video hosting by TinyPic సుత్తి వీరభద్రరావు నటించిన మరో మర్చిపోలేని పాత్ర "రెండు రెళ్ళు ఆరు" సినిమాలోనిది. ఈపాత్రకు సంగీతమంటే చాలా ఇష్టం. ఆ సంగతి తెలుసుకున్న అమ్మాయి తరఫున వారు చిన్న మోసం చేసి పెళ్ళి జరిపిస్తారు కానీ ఆ రోజు రాత్రే తన భార్యకు పాడడం రాదన్ని సంగతి తెలిసి కోప్పడుతాడు. ఎప్పటికయినా సంగీతం నేర్చుకొని తన భర్తను మెప్పించాలని ఆయన భార్య పగలనక, రాత్రనక పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ చిత్రహింసలు పెడుతుంటుంది. భార్య పైన కోప్పడలేక, తన కోపాన్ని ఆపుకోలేక బట్టలు చించుకొని శాంతిస్తుంటాడు. చివరకు బీవీ పట్టాభిరాం హిప్నాటిజం ద్వారా ఆమెను మార్పించగలుగుతాడు.
                                                                                      
                                                                              (మిగతా మూడవ భాగంలో)

జాతి బావమరిదికి అన్యాయం

Posted by జీడిపప్పు

చరకుడిని ఆయుర్వేద పితామహుడు అని పిలుస్తాము. రాత్రింబవళ్ళు కష్టపడి ఎన్నో వ్యాధులకు మందులు కనిపెట్టిన చరకుడు ఆయన భార్య సహకారం లేనిదే అన్నీ సాంధించలేకపోయిఉండవచ్చు. ఆయన తన కుటుంబాన్ని పట్టించుకోకుండా సమయమంతా తన పరిశోధనలకే కేటాయిస్తుంటే ఆయన భార్య పిల్లల, కుటుంబ బాగోగులు చూసుకునేది అనుకుందాము. జీవితాంతం భర్తకు అనుకూలంగా ఉన్నదని ఆమెను "ఆయుర్వేద మాత" అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది?

పెప్సీ కంపెనీ కొన్నేళ్ళ క్రితం ఆశించినమేరకు లాభాలు ఆర్జించకపోవడంతో అప్పటి సీఈవోను మార్చి భారతీయ మహిళ అయిన "ఇంద్ర నూయి" ని సీయీవో చేసారు. తన తెలివితేటలతో ఆమె కంపెనీని ప్రగతిపథంలోకి తీసుకెళ్ళింది,మహామహులను తోసిరాజని "వుమన్ ఆఫ్ ద ఇయర్" అవార్డు అందుకుంది. తన భర్త సహకారం లేకుంటే తాను ఇవన్నీ సాధించగలిగేదాన్ని కాదాని ఈమె చెప్తుంటుంది. ఈమె వ్యాపారపనుల్లో బిజీగా ఉన్నపుడు కష్టపడి పిల్లల్ని, కుటుంబాన్ని చూసుకున్నందుకు ఈమె భర్తకు "మ్యాన్ ఆఫ్ ద ఇయర్" అవార్డు ఇవాల్సిందేనా?

ఇవి ఎపుడు ఎందుకు చెపుతున్నానంటే "భూమిక" అనే ఫెమినిస్ట్ పత్రిక నిర్వహిస్తున్న సత్యవతిగారు తన బ్లాగులో వ్రాసిన వ్యాసం చూసాను. అందులో ఒక వాక్యం ఇలా ఉంది: "జాతి మొత్తానికి పితృసమానుడుగా భావిస్తూ ' జాతిపిత'గా గాంధీజీని గౌరవిస్తామే! మరి, ఆ 'జాతిపిత' సహచరి ' జాతి మాత' కాదా? "

ఇదే వ్యాసం మూడేళ్ళ క్రితం ఆంధ్రజ్యోతిలో వచ్చినపుడు మా గురువుగారు తెలుగోడుగారు అన్నమాటలను చూసి పగలబడి నవ్వాను. కొన్నింటిని చూసి అప్పటికప్పుడు నవ్వి మర్చిపోతాము, కానీ కొన్నిటిని తలుచుకొని మరీ నవ్వుకుంటుంటాము. మా గురువుగారి కామెంటు అలాంటిది మరి. ఆయనేమన్నారంటే - "H1 కు, H4 కు ఉన్న తేడా ఉంది జాతిమాతకు, జాతిపిత భార్యకు ... .... ఓ మిత్రుడు ఈ లెక్కన గాంధీ బావ జాతి మామ, గాంధీ అత్తగారు జాతి అమ్మమ్మా అవుతారా అని సందేహపడ్డాడు". అవును మరి, జాతిపితకు బంధువులయినవారినందరినీ "జాతిమాత" "జాతికూతురు" "జాతి బావమరిది" "జాతి మేనత్త" అని పిలుస్తూపోతుంటే వారికి ఉన్న గౌరవం కూడా పోతుంది.

ఇక సత్యవతిగారు "కస్తూరిబాకు అన్యాయం" అన్నారు.  స్త్రీవాదమంటే ముందూ వెనకా చూడకుండా "ఠాఠ్ మహిళలకు అన్యాయం జరుగుతోంది" అనడమే కాదు, ఆ పొర తీసి నిజ ప్రపంచాన్ని కూడా చూడాలి. అప్పుడే దేశవ్యాప్తంగా దశాబ్దాలుగా కస్తూరిబా పేరిట నడుస్తున్న కళాశాలలు, కస్తూరిబా పేరిట ఎందరో మహిళలకు ఆశ్రయమిస్తున్న మహిళా సంక్షేమ హాస్టళ్ళు, కస్తూరిబా పేరిట ఇస్తున్న పురస్కారాలు కనిపిస్తాయి, చిన్న గదిలోని వస్తువుల బదులు.

అలా చూడనన్నాళ్ళూ "జాతి బామ్మర్ది"కి అన్యాయం జరుగుతూనే ఉంటుంది సుమా/ఉదయభానూ!!

హాస్యచక్రవర్తి సుత్తి వీరభద్రరావు - మొదటి భాగం

Posted by జీడిపప్పు

'నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం' అన్న హాస్య బ్రహ్మ జంధ్యాల హాస్యప్రియులకు అందించిన మరో వరం సుత్తి వీరభద్రరావు గారు. జంధ్యాల సృష్టించిన పాత్రలకు, ఆయన వ్రాసిన మాటలకు సుత్తి వీరభద్రరావు తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరు. చిత్రమయిన పాత్రలలో మరింత విచిత్రమయిన అలవాట్లు, సంభాషణలతో హాస్యానికి కొత్త నిర్వచనాన్ని అందిచారు సుత్తి వీరభద్రరావు.

విజయవాడలో కాలేజీలో చదువుకుంటున్నపుడే నటనపై ఆసక్తి పెంచుకున్న వీరభద్రరావు నాటకాలలో మంచి నటుడిగా పేరుతెచ్చుకున్నాడు. జంధ్యాల దర్శకత్వం వహించిన "నాలుగు స్తంభాలాట" చిత్రంద్వారా తెరంగ్రేటం చేసి ఎన్నో మరిచిపోలేని పాత్రలతో ప్రేక్షకులను నవ్వించారు. తన అలవాట్లతో పక్కవాళ్ళను ఇబ్బంది పెట్టడం, అవతలివాళ్ళు ఉక్కిరిబిక్కిరయ్యేలా గుక్క తిప్పుకోకుండా  మాట్లాడడం, తిట్లు కాని తిట్లతో హింసించడం వీరభద్రరావుకే చెల్లింది. హాస్య బ్రహ్మ జంధ్యాల సినిమా అంటే హీరో ఎవరయినా ముందుగా గుర్తుకొచ్చే ఈ హాస్య చక్రవర్తిని, పరోక్షంగా హాస్య బ్రహ్మను, స్మరించుకుంటూ ఆయన నటించిన కొన్ని చిత్రాలను గుర్తుచేసుకొనే ఓ చిన్న ప్రయత్నమే ఈ వ్యాసాల ఉద్దేశ్యం.

దాదాపు అందరూ కొత్తనటులతో జంధ్యాల తీసిన నాలుగు స్తంభాలాటలో ఒక హీరో తండ్రి పాత్రతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టారు వీరభద్రరావు. ఈయనకు భారతీయ సంస్కృతి, ఆచారాలు అంటే చాలా గౌరవం. కానీ కొడుకేమో ఆధునికంగా ఉండాలనుకొంటాడు. ప్రపంచంలోని ప్రసిద్ధులంతా భారతీయులేనని ఈయన గాఠ్ఠి నమ్మకం. అందుకే "పైథాగరస్ ఎవడంటే ఏ జర్మనీవాడో ఏ రష్యావాడో అంటావు. వాడి అసలు పేరు గిరీషుడనీ, కాకినాట్లో మన పైథాగారబ్బాయని తెలుసా? షేక్స్పియర్ ఎవడు? శేషప్పయ్య అనే తమిళుడు, రామనాథ జిల్లావాడు, మన భారతీయుడునూ. న్యూటన్ ఎవరు? నూతనుడని బెంగాలీయుడు, మన భారతీయుడునూ" అంటుంటాడు.

ఇవి పట్టించుకోని కొడుకును, మిగిలినవాళ్ళనూ "నిన్నూ ఈ దేశాన్ని బాగు చెయ్యడం నావల్ల కాదు, నావల్ల కాదు" అంటుంటాడు. ఈయన అసిస్టెంటు సుత్తి వేలు వరండాలో కూర్చుకొని లెక్కలు వ్రాసుకుంటుంటే ప్రతి చిన్నవిషయానికి "అసలు ఈ విషయం తెలుసా నీకు" అంటూ చెప్పడం మొదలుపెడటాడు. మనకు తెరపైన సుత్తితో మేకును కొడుతున్న దృశ్యం కనిపిస్తుంది. ఇలా సుత్తికొట్టించే పాత్ర బాగా పాపులర్ అవడంతో వీరభద్రరావు కాస్తా సుత్తి వీరభద్రరావు అయ్యారు.

ఈ సినిమా తర్వాత శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలో ధనవంతుడయిన తండ్రిపాత్ర పోషించినా పెద్దగా పేరు రాలేదు. అదే ఏడాది జంధ్యాల తీసిన "ఆనంద భైరవి" సినిమా ద్వారా సుత్తి వీరభద్రరావు సత్తా ఏమిటో ప్రేక్షకులకు తెలిసివచ్చింది. ఈ సినిమాలో ఆయన ఒక పల్లెటూరి వైద్యుడు. చాలా మంచివాడు, ఉన్నతాభావాలు కలిగిన పెద్దమనిషి. తెలుగు అభిమానమెక్కువ, ఎప్పటికయినా గొప్ప రచయిత కావాలని ప్రాసలున్న వాక్యాలను సృష్టిస్తుంటాడు. ఉద్యోగం లేని కొడుకు, ఆనందమేసినా బాధ కలిగినా కయ్‌య్‌య్‌య్ మని ఈలవేసే కోడలు ఈయన కుటుంబ సభ్యులు. ఇక ఈయన ప్రాసల ప్రసహనం:

తన దగ్గరకు వచ్చిన రోగితో - "ఆయకాయలో వేడి ఉంటుంది. ఆ వేడి నాలాంటి వాడికల వైద్యుడికి నాడిలో తెలుస్తుందిరా బోడి". సినిమానుండి కోడలికంటే ముందే ఇంటికి తిరిగివచ్చిన కొడుకుతో - "కోడలేదిరా అంటే గోడలకేసి, నీడలకేసి చూస్తావేంట్రా ఊడలజుట్టు వెధవా". తన భార్య సినిమాహాల్లో ఈలవేసిందన్న సంగతి చెప్పిన కొడుకుతో -  "అబ్బా మనకా ఈలల గోల ఏల. ఈ ఈలన్నది ఇలలో కలలో మన ఇంటావంటా లేదే"

నిద్రపోతున్న కొడునులేపి "నానీ నానీ నీ నూనె నీ నూనే నా నూనె నా నూనే. నేనే నేను, నీ నూనె నానూనెనని, నానూనె నీనూనని నేనన్నానా  నిన్నను నేనా? నో నో నో. నేనన్నానా నున్నని నాన్నా, నై నై నై. ఇందులో 56 నాలున్నాయి లెఖ్ఖ చూసుకో" అంటాడు. చిరాకేసిన కొడుకు "నాన్నా" అని "ఇవి కూడా కలుపుకో 58 అవుతాయి" అంటాడు.

నాట్య పోటీ రెండవసారి ఏర్పాటు చేయించి హీరోయిన్ నెగ్గిన తర్వాత " మీ సిగ్గు బొగ్గులవ్వ. ఆ రోజు శర్మగారి పైన నెగ్గిన గర్వంతో దిగ్గున లేచి భగ్గున మండిపడ్డారు కాదా. ఈ రోజు నిగ్గుతేలిన ప్రతిభతో ఈ మల్లెమొగ్గ నెగ్గింది. ఇక మీరు తగ్గేసి, మాటకు తల ఒగ్గేసి, ఊరంతా ముగ్గేసి, శర్మగారిని సన్మానించండి. ఆ తర్వాత మీకు సిగ్గనిపిస్తే ఆ దగ్గు ఆపేసి నా దగ్గరకు రండి. ఓ ఉగ్గు గిన్నెడు మందిస్తాను, జగ్గు నీళ్ళు కలిపి ఉగ్గు తాగినట్లు తాగి రగ్గు కప్పుకుని పడుకుందురుగానీ" అంటూ అహంకారులయిన ఊరిపెద్దలకు బుద్ది చెప్తాడు.

కోడలి గురించి "మంచి మర్యాదగల మహా మగువ, మానవసేవయే మాధవసేవ అని మనసారానమ్మిన మహాఇల్లాలు మర్రిచెట్టు మహాలక్షమ్మగారి ముద్దుల మూడో మనవరాలు కదా అని మనువు చేసుకుంటే" అన్నపుడు కొడుకు "నానా నీ ప్రాసలాపు వినలేక ఛస్తున్నాము. ఈ జన్మలో నువ్వు కథ రాయలేవు, రచయితవు కాలేవు" అంటాడు.

అంతే, - "మొక్కుబడికి బుక్కులెన్ని చదివినా బక్కచిక్కిన కుక్కగొడుగు మొక్కలా చెదలు కొట్టేసిన చెక్క ముక్కలా కుక్క పీకేసిన పిచ్చి మొక్కలా బిక్కమొహం వేసుకొని వక్క నోట్లో కుక్కుతూ బొక్కుతూ బెక్కుతూ చుక్కలు లెక్క పెడుతూ ఇక్కడే గుక్క పెట్టి ఏడుస్తూ ఈ చుక్కల చొక్కా వేసుకొని డొక్కు వెధవలా గోళ్ళు చెక్కుకుంటూ నక్కపీనుగులా చెక్కిలాలు తింటూ అరిటి తొక్కలా ముంగిట్లో తుక్కులా చిక్కు జుట్టేసుకుని ముక్కుపొడి పీలుస్తూ కోపం కక్కుతూ పెళ్ళాన్ని రక్కుతూ పెక్కు దిక్కుమాలిన పనులు చేస్తూ రెక్కలు తెగిన అక్కుపక్షిలా నక్కి నక్కి ఈ చెక్కబల్ల మీద పక్కచుట్టలా పడుకోకపోతే, ఏ పక్కకో ఓ పక్కకెళ్ళి పిక్కబలం కొద్దీ తిరిగి నీ డొక్కశుద్దితో వాళ్ళను ఢక్కామొక్కీలు తినిపించి నీ లక్కు పరీక్షించుకొని ఒక్క చక్కటి ఉద్యోగం చేజిక్కించుకుని ఒక్క చిక్కటి అడ్వాన్సు చెక్కు చెక్కుచెదరకుండా పుచ్చుకుని తీసుకురావచ్చు కదరా తిక్క సన్నాసీ. ఇందులో యాభయ్యారు కాలున్నాయి తెలుసా" అని కొడుక్కు తన విశ్వరూపాన్ని చూపిస్తాడు

ఎంతటి కఠినమయిన వాక్యాన్నయినా అక్షర, ఉచ్చారణ దోషాలు లేకుండా అనర్గళంగా చెప్పడమే కాకుండా చక్కని నటనను జోడించి ఆ పాత్రకు జీవంపోయడం ద్వారా ఒక్కసారిగా అగ్ర హాస్యనటుడయి వెనువెంటనే "బాబాయ్, అబ్బాయ్" సినిమాలో రెండో హీరో పాత్ర చేజిక్కించుకున్నాడు.    

                                                                                 (మిగతా రెండవ భాగంలో)

మరో ధృవతార బాబీ కెన్నెడీ

Posted by జీడిపప్పు

కెన్నెడీ. ఆ పేరు వింటే ఎంతోమంది అమెరికన్ల హృదయం పులకరిస్తుంది. ఆ పేరు విన్నపుడు ఉప్పొంగే సంతోషంతో పాటు విషాద జ్ఞాపకాలు కూడా గుర్తుకొస్తాయి. గత అర్థ శతాబ్దంలో అమెరికాను పాలించిన అతి గొప్ప అధ్యక్షుడు ఎవరంటే అందరి మదిలో మెదిలే వ్యక్తి జాన్ ఎఫ్ కెన్నెడీ. కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే దేశాన్ని పాలించినా, ప్రెసిడెంట్ అన్న పదానికున్న గౌరవాన్ని మరింత ఇనుమడింపచేసిన జాన్ ఎఫ్ కెన్నెడీ అంత గొప్పవాడిగా పేరుపొందడానికి కారకుడు ఆయన తమ్ముడు రాబర్ట్ "బాబీ" కెన్నెడీ.

కెన్నెడీ దంపతులకు ఏడవ సంతానమయిన బాబీ కెన్నెడీ బాల్యం ఆటపాటలతో గడిచిపోయింది. జాన్ కెన్నెడీకీ, బాబీ కెన్నెడీకి మధ్య ఎనిమిదేళ్ళ వ్యత్యాసం ఉండడంతో చిన్నపుడు ఇరువురిమధ్య ఎక్కువ చనువు ఉండేది కాదు. 1951 లో తన అన్నతో కలసి ఆరువారాలపాటు ఇజ్రాయిల్, ఇండియా మొదలయిన దేశాలను పర్యటించాడు. ఆ ఆరువారాల్లో అన్నదమ్ములమధ్య సాన్నిహిత్యం పెరిగింది. అమెరికాకు తిరిగివచ్చిన తర్వాత బాబీ తన భార్య పిల్లలతో కలసి వాషింగ్టన్‌కు వెళ్ళి అక్కడ లాయరు వృత్తి మొదలుపెట్టాడు. కొద్ది రోజులకు జాన్ కెన్నెడీ సెనేటర్ గా పోటీ చేస్తుంటే తన సోదరుడికి సహయంగా ఉండడానికి లాయరు వృత్తిని విడిచిపెట్టాడు. అప్పటినుండి చట్ట సభల్లో ఎన్నో పదవులు చేపట్టి పేరు తెచ్చుకొన్నాడు.

1960లో జాన్ ఎఫ్. కెన్నెడీ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసినపుడు బాబీ సర్వం తానై నడిపించాడు. ఎత్తులకు పైఎత్తులు వేసి ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టేవాడు. కాస్త మొండివాడయినా నమ్మకానికి మారుపేరుగా నిలిచి ప్రజల దగ్గర "అన్నకు తగ్గ తమ్ముడంటే జాన్ ఎఫ్. కెన్నెడీకి బాబీ కెన్నెడీలా ఉండాలి" అని ప్రశంసలు తెచ్చుకున్నాడు. జాన్ కెన్నెడీ ప్రెసిడెంట్ అయిన తర్వాత తన తమ్ముడిని అటార్నీ జనరల్ గా నియమించాడు. అమెరికా చరిత్రలో ఈనాటి వరకు ఏ అటార్నీ జనరల్‌కు లేని అధికారాలు బాబీ చేతికి వచ్చాయి.

బాబీ కెన్నెడీ తీసుకొనే ప్రతి నిర్ణయాన్ని జాన్ కెన్నెడీలాంటి మేధావి మారుమాటాడక అంగీకరించేవాడు. చిన్నతనం నుండి విశాలభావాలుగల బాబీ నల్లజాతీయుల హక్కులకోసం ఎన్నో చట్టాలు తెచ్చాడు. వర్ణవివక్ష ఎక్కువ ఉన్న మిసిసిపీలో ఒక యూనివర్సిటీలో మొదటిసారి ఒక నల్లజాతీయుడయిన విద్యార్థి చేరుతున్న రోజు గొడవలను ఆపడానికి పెద్ద ఎత్తున సైన్యాన్ని మొహరింపచేసి తెల్లవారిని అదుపులో ఉంచి అమెరికాను నివ్వెరపోయేలా చేసాడు. మార్టిన్ లూథర్ కింగ్‌కు రక్షణ కల్పించి నల్లవారికి సమానహక్కులు ఉండాలని ప్రజల భావాలను మార్చే ప్రయత్నం చేసాడు.

60, 70లలో అమెరికాలో పాతుకుపొయి ఉన్న మాఫియాకు బాబీ సింహస్వప్నమయ్యాడు. మాఫియాను అదుపులోకి తెచ్చేందుకు చట్టాలను ప్రవేశపెట్టి అణిచివేయడం మొదలుపెట్టాడు. క్యూబా వివాదంలో రష్యాతో అణుయుద్దం దాదాపు ఖాయమయినా జరగకపోవడానికి కారణం జాన్-బాబీ కెన్నెడీల మంత్రాంగమే. అప్పటివరకు అధ్యక్షులను తమ చెప్పుచేతల్లో ఉంచుకొన్న CIA ఆటలు బాబీ ముందు సాగలేదు. CIA దురాగతాలకు అడ్డుకట్టవేయడానికి ప్రయత్నించిన జాన్ ఎఫ్ కెన్నెడీ 1963 లో CIA కుట్రవల్ల హత్య చేయబడ్డాడు.

తల్లిదండ్రులకంటే ఎక్కువ సాన్నిహిత్యం ఉన్న తన సోదరుడు హత్యకు గురికావడం బాబీని కలచివేసింది. కొద్దిరోజులు జీవితం పట్ల నిరాశ చెందినా, తమ ఇద్దరి ఆశయాలకోసం మళ్ళీ అధ్యక్ష పదవికి పోటీ చేసాడు. బాబీ అధ్యక్షుడయితే తమ ఆటలు సాగవని తెలుసుకున్న CIA, మాఫియా కలసి బాబీ కెన్నడీని కాలిఫోర్నియాలో హత్య చేయించాయి.

1968 జూన్ 6 న కేవలం 42 ఏళ్ళ వయసులో మరణించిన బాబీ కెన్నెడీ అన్యాయాన్ని అరికట్టి ప్రజల మేలు కోసం ఏదయినా చేయడానికి వెనుకాడని నాయకుడిగా, తనను నమ్మిన అన్న కోసం ప్రాణాలివ్వడానికి వెనుకాడని తమ్ముడిగా ఇప్పటికీ అందరి హృదయాల్లో ఉన్నాడు.

అమెరికాలో ఆంధ్రుల పైన దాడి

Posted by జీడిపప్పు

ఈ మధ్య పత్రికల్లో ప్రవాసభారతీయుల పైన దాడుల వార్తలు దర్శనమిస్తున్నాయి. ఆ మధ్య అమెరికాలో తెలుగువారిని వరుసగా హత్యలు చేసారనీ, తెలుగువారిపైన దాడులు ఎక్కువ జరుగుతున్నాయని కూడా వార్తలు వచ్చాయి. ఎన్నడూ లేనిది ఆస్ట్రేలియాలో భారతీయులను లక్ష్యం చేసుకొని కొన్ని అల్లరి మూకలు దాడులు కొనసాగిస్తున్నాయి. ఇది అమానుష చర్య. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీనికి నిరసనగా అమితాబ్ బచ్చన్ తనకు ఆస్ట్రేలియావారు ఇవ్వబోతున్న డాక్టరేట్ తిరస్కరించాడు. నేను కూడా ఇంకో వారం రోజులపాటు ఆస్ట్రేలియన్ మోడల్స్ ఫోజులిచ్చిన ప్లేబోయ్ మేగజైన్లను, వాళ్ళు నటించిన ప్లేబోయ్ వీడియోలను బహిష్కరిస్తున్నాను.

దాడులు తప్పు అన్నదానిలో అణుమాత్రమనుమానం లేదు కానీ, దానికి ప్రతిచర్యగా మనవాళ్ళు బిజీ రోడ్ల పైన బైఠాయింపులు, రాళ్ళు రువ్వడాలు చేయడం మాత్రం బాగలేదు. నేను ఆఫీసుకు వెళ్ళే దారిలో ఎవరయినా నిరసనలు చేస్తుంటే Who the #$&% are these morons delaying my meeting అనుకుంటాను. ఆస్ట్రేలియాలో మనవాళ్ళు చేస్తున్న చర్యలవల్ల మంచివాళ్ళకు కూడా కోపం వచ్చి వారిలో కూడా "వర్ణ" ఆలోచనలు మొదలవుతాయి. కాబట్టి ఇప్పటికయినా మనవాళ్ళు తమ పంథా మార్చుకొంటే మంచిది.

ఇక అమెరికా సంగతి కొస్తే - కొద్ది కాలం క్రితం మన తెలుగు మీడియావాళ్ళు "అమెరికాలో ఆంధ్రుల పైన దాడులు" అంటూ ఊదరగొట్టారు. దాడులు జరిగిన మాట నిజమే. మొన్నటికి మొన్న ఒక ఆంధ్ర విద్యార్థి పైన దాడి జరిగింది. ఆ వార్త మొత్తం చదివిన తర్వాత ఆ విద్యార్థి పట్ల నాకు కలిగిన అభిప్రాయం - What a mindless idiot. వినడానికి కటువుగా ఉన్నా ఇది నిజం. ఇలాంటి బుద్దిలేనివాళ్ళకు అలాంటి శాస్తే జరుగుతుంది మరి.

ఇలా ఎందుకంటున్నానంటే, కొన్నేళ్ళ క్రితం అమెరికాలో అడుగుపెట్టినపుడు సీనియర్లు కొన్ని సలహాలు ఇచ్చారు. అవి: చీకటి పడిన తర్వాత ఒంటరిగా తిరగవద్దు. ఎప్పుడూ జేబులో ఐదు-పది డాలర్లు ఉంచుకో. ఎవరయినా, ముఖ్యంగా నల్లజాతీయులు, ఎదురుపడితే సూటిగా వారి కళ్ళలోకి చూడకు. నల్లజాతీయుడు వచ్చి డబ్బు అడిగితే పటతటాయించకుండా నీ దగ్గర ఉన్న మొత్తం డబ్బు ఇచ్చేయి. పొరపాటున కూడా వారితో వాదనకు/పోట్లాటకు దిగకు.

సాధారణంగా ఈ నల్లజాతీయులు సిగరెట్లు/మందు/డ్రగ్స్ కోసం మనల్ని డబ్బు అడుగుతారు. మాటమాట్లాడకుండా వాలెట్ తీసి మొత్తం డబ్బు ఇచ్చేస్తే ఏమీ అనకుండా వెళ్ళిపోతారు. నేనయితే కొత్తగా వచ్చినవాళ్ళకు "నిన్ను అడిగితే వాలెట్ ఇచ్చెయ్యి" అని చెప్తాను. డబ్బు ఇచ్చిన తర్వాత కూడా గాయపరిచేవారు చాలా తక్కువ. (ఇప్పటివరకు నన్నెవరూ డబ్బు అడగలేదు. అడిగితే వాలెట్ ఇచ్చేస్తాను. ఇచ్చినా నన్ను గన్‌తో కాలిస్తే అపుడు చెప్తాను, నేను అనుకున్నది తప్పు అని!)

ఈ వివరాలు దాదాపు కొత్త విద్యార్థులందరికీ సీనియర్లు చెప్తారు. దాదాపు అందరూ పాటిస్తారు కానీ కొందరు తలతిక్క మనుషులు పాటించక ప్రాణాలపైకి కొనితెచ్చుకుంటారు. గత ఏడాది జరిగిన 10 హత్యలలో సుమారు ఏడెనిమిది ఇందువల్లే జరిగాయి. గత ఏడాది డాలస్‌లో ఒక దేశీ తన గర్ల్ ఫ్రెండ్ ముందు ఫోజు కొట్టాలని నల్లజాతీయుడికి ఎదురు తిరిగాడు. సీన్ కట్ చేస్తే డిక్కీలో (శవపేటికలో) తొంగున్నాడు.

ఇక తెలుగువాళ్ళ పైనే ఈ దాడులు ఎందుకు జరుతాయంటే తెలుగువాళ్ళ జనాభా అంత ఎక్కువ కాబట్టి. నేను స్కూల్లో ఉద్యోగం అడుక్కుంటున్నపుడు..err.. వెతుక్కుంటున్నపుడు చాలామంది అమెరికన్లు are you from Hyderabad? అన్నారు. కొన్ని స్కూళ్ళల్లో అయితే మాస్టర్స్ లో "(అన)అధికార భాషగా తెలుగు" ఉంటుంది! కాబట్టి అమెరికాలో ఎవరయినా విద్యార్థి పైన దాడి జరిగిన వార్త చూసి ఆ విద్యార్థి తెలుగు విద్యార్థి కాకపోతే ముక్కు తీసి వేలుపైన వేసుకుంటాము.

మీడియా ఏమో "అమెరికాలో ఆంధ్రుల హత్య" అని రాద్ధాంతం చేస్తుంది. వీళ్ళు అమెరికాలో ఒక సంస్థ తెలుగువాళ్ళను చంపడమే ధ్యేయంగా కార్యకలాపాలు సాగిస్తున్న రేంజ్‌లో హంగమా చేస్తారు,ఎప్పటిలాగే గోరంతలు కొండంతలు చేసి చెప్తారు. మొన్న మిసిసిపీలో జరిగిన సంఘటనలో ఆ విద్యార్థి చొక్కా కారు డోరుకు తగులుకొని ఉండగా 100 మీటర్లు లాక్కుని వెళ్ళినట్టు హిందూ పత్రికలో వస్తే, కిలోమీటరు లాక్కెళ్ళినట్టు ఈనాడులో వచ్చింది. ఒక బ్లాగరయితే ఏకంగా  ఆ విద్యార్థి ఆత్మకు శాంతి కలగాలని కూడా ప్రార్థించాడు.. మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో బ్రతికించేసాడు! ఇలా ఉంటాయి లీలలు.

అన్నట్టు నిన్న మెగాస్టార్ గారు "ప్రవాసాంధ్రుల రక్షణకొసం ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి" అన్నారు. అమెరికాలో సంపాదిస్తూ అమెరికా దేశానికి పన్ను కట్టే నా రక్షణకోసం ఒక శాఖనా??!!! అదీ నేను పైసా డబ్బు కట్టకుండా?! అలా అయితే ఢిల్లీదాకా ఏంటీ..ఢ ఢ ఢల్లాస్ దాకా దేక్కున్నా మనకేమీ అభ్యంతరం లేదు. కాకపోతే నాకొచ్చిన సందేహమేమిటంటే, మెగాజోకర్ గారు ముఖ్యమంత్రి అయి ఒక శాఖను ఏర్పాటు చేసారే అనుకుందాము. అమెరికాలోని ఒక నగరంలో ఆంధ్రుని పైన దాడి జరుగుతుంటే మెగాజోకర్ గారు ఎలా రచ్చిస్తారబ్బా???